Ostrava Open: ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సానియా–షుయె జాంగ్ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో డానిలినా (కజకిస్తాన్)–మరోజవా (బెలారస్) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి– నినోమియా (జపాన్) జోడీతో సానియా–షుయె జాంగ్ ద్వయం తలపడుతుంది.
చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!