Pro Kabaddi League 2022: చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్‌ ఢిల్లీ 'హ్యాట్రిక్‌' విజయం

13 Oct, 2022 07:04 IST|Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ సాధించింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్‌ 13 పాయింట్లు, మంజీత్‌ 12 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్‌ గిల్‌ 21 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.  

మరిన్ని వార్తలు