ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు నిరాశ

28 Aug, 2021 05:38 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ క్వాలిఫయింగ్‌ బరిలో మిగిలిన చివరి భారత ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. ప్రజ్నేశ్‌ 3–6, 4–6తో క్రిస్టోఫర్‌ యుబ్యాంక్స్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. క్రిస్టోఫర్‌ 14 ఏస్‌లు సంధించగా... ప్రజ్నేశ్‌ 5 ఏస్‌లను మాత్రమే కొట్టాడు. ఇతర భారత ప్లేయర్లు సుమిత్‌ నగాల్, రామ్‌కుమార్‌... మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్‌లోనే ఓడారు.

మరిన్ని వార్తలు