ప్రజ్నేశ్‌ ముందంజ

6 Mar, 2021 05:57 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 134వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 6–4, 2–6, 7–6 (7/1)తో ప్రపంచ 102వ ర్యాంకర్‌ జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్నేశ్‌ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్‌ థామస్‌ మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు.

మరిన్ని వార్తలు