మెయిన్‌ ‘డ్రా’కు ప్రణవ్‌ రావు అర్హత 

8 Mar, 2023 07:42 IST|Sakshi

థాయ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ కుర్రాడు గంధం ప్రణవ్‌ రావు మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు.

బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ప్రణవ్‌ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్‌ షి చియె (చైనీస్‌ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్‌ గౌడ, రవి కూడా మెయిన్‌ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు. 

మరిన్ని వార్తలు