IPL 2022: అది మీ కర్మ.. అనుకుంటే అనుకోండి: పృథ్వీ షా

18 Mar, 2022 20:05 IST|Sakshi
Courtesy: BCCI/IPL

ఢిల్లీ: ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా యో-యో టెస్టులో ఫెయిల్‌ అయ్యాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో నిర్వహించిన యో-యో టెస్టులో విఫలం చెందినట్లు జాతీయ మీడియాలో వెలుగుచూసింది. దీనిపై నేరుగా స్పందించని పృథ్వీషా.. కర్మ సిద్ధాంతాన్ని జోడించి మరీ కౌంటర్‌ ఇచ్చాడు. 

‘మీకు నా పరిస్థితి తెలియనప్పుడు నన్ను జడ్జ్‌ చేయకండి. అనుకుంటే అనుకోండి.. అది మీ కర్మ’ అంటూ సెటైరిక్‌గా ఇన్‌స్టా గ్రామ్‌ పోస్ట్‌ ద్వారా స్పందించాడు. అసలు యో-యో టెస్టులో పాస్‌ అయ్యాడా.. లేదా అనే విషయాన్ని చెప్పకుండా ఇలా రాసుకు రావడం విఫలం చెందే ఉంటాడనే దానికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం యో-యో ఫిట్‌నెస్‌ టెస్టులో పాస్‌ కావడానికి 16.5 స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ పృథ్వీ షా 15 కంటే తక్కువ పాయింట్లే నమోదు చేశాడనేది రిపోర్ట్‌లు సారాంశం. 

ఇదిలా ఉంచితే, ఈనెల 26వ తేదీ నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆడతాడా.. లేదా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

కేఎల్‌ రాహుల్‌ జట్టుకు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

మరిన్ని వార్తలు