Uber Cup 2022: ఇక ఉబెర్‌ కప్‌ టోర్నీపై దృష్టి: పీవీ సింధు 

2 May, 2022 07:47 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో పెనాల్టీ పాయింట్‌ వివాదం కూడా తన ఓటమికి ఒక కారణమని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అభిప్రాయపడింది. ఇక తన దృష్టంతా ఈనెల 8 నుంచి జరిగే ఉబెర్‌ కప్‌ టోర్నీపై ఉందని తెలిపింది.

సమయానికి విమానం అందుకోవాలనే కారణంతో సింధు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని.. అంతే తప్ప సెమీఫైనల్‌ ఉదంతంపై నిరసన వ్యక్తం చేయడానికి  కాదని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులకు సింధు సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. 

చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం

మరిన్ని వార్తలు