ఒడెన్స్ (డెన్మార్క్): గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాక ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. నేటి నుంచి మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)తో సింధు ఆడనుంది. భారత్కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోరీ్నలో ఆడనుంది. తొలి రౌండ్లో అయా ఓరి (జపాన్)తో సైనా తలపడనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.