BWF Super 500 Thailand Open: సెమీఫైనల్లో అడుగు పెట్టిన పీవీ సింధు

20 May, 2022 20:07 IST|Sakshi

బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ థాయిలాండ్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సింధూ.. పాన్‌కు చెందిన అకానె యమగుచిపై 21-15, 20-22, 21-13 స్కోర్‌తో విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది.

కాగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం జరగనున్న సెమీఫైనల్లో చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో సింధు తలపడనుంది. 

చదవండి: India Tour of Ireland: టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు