పోరాడి ఓడిన రామ్‌కుమార్‌ 

10 Mar, 2022 07:45 IST|Sakshi

ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ రామ్‌కుమార్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 170వ ర్యాంకర్‌ రామ్‌2–6, 6–3, 4–6తో 124వ ర్యాంకర్‌ లియామ్‌ బ్రాడీ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌ ఐదు ఏస్‌లు సంధించి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు