Ranji Trophy 2022-23: శతక్కొట్టిన రుతురాజ్‌.. 16 ఫోర్లు, 3 సిక్సర్లతో..!

10 Jan, 2023 18:45 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా తమిళనాడుతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్‌, టీమిండియా ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (126 బంతుల్లో 118; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు గత మ్యాచ్‌ డబుల్‌ సెంచరీ హీరో కేదార్‌ జాదవ్‌ (56), అజిమ్‌ ఖాజీ (87 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ]

అజీమ్‌ ఖాజీకి జతగా సత్యజీత్‌ బచ్చవ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో సిద్దేశ్‌ వీర్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (7), సౌరభ్‌ నవాలే (5) విఫలం కాగా.. కెప్టెన్‌ అంకిత్‌ బావ్నే (45) పర్వాలేదనిపించాడు. తమిళనాడు బౌలర్లలో లక్ష్మీనారాయణన్‌ విఘ్నేశ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్‌ వారియర్‌, రవి శ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, విజయ్‌ శంకర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు అస్సాంతో జరిగిన మ్యాచ్‌ను మహారాష్ట్ర డ్రాగా ముగించగా.. ముంబైతో మ్యాచ్‌ను తమిళనాడు డ్రా చేసుకుంది. 


 

మరిన్ని వార్తలు