T20 WC 2022: రషీద్‌ ఖాన్‌కు తీవ్ర గాయం.. టోర్నీ నుంచి ఔట్‌!

2 Nov, 2022 11:27 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్గానిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో బౌండరీ ఆపే  ప్రయత్నంలో రషీద్‌ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను వదిలి రషీద్‌ ఫిజియో సాయంతో బయటకు వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ  ఓటమితో మహ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో రషీద్‌ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో  ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. ఆఫ్గాన్‌ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక తమ అఖరి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ నవంబర్‌ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది.


చదవండివన్డే చరిత్రలో తొలి వికెట్‌ టేకర్‌.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ కన్ను మూత

>
మరిన్ని వార్తలు