మెయిన్‌ ‘డ్రా’కు రష్మిక, నిధి, సాత్విక

21 Dec, 2021 12:01 IST|Sakshi

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, నిధి చిలుముల, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రేయ తటవర్తి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక 6–1, 6–4తో హుమేరా బహార్మస్‌ (భారత్‌)పై, నిధి 4–6, 6–4, 10–6తో జెన్నిఫర్‌ ల్యుఖమ్‌ (భారత్‌)పై, సాత్విక 6–0, 6–1తో సౌమ్య (భారత్‌)పై, శ్రేయ 6–1, 6–2తో ఎలీనా (డెన్మార్క్‌)పై గెలిచారు.

మరిన్ని వార్తలు