ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నాహలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లీసెస్టర్షైర్ వేదికగా జూన్ 24న నుంచి 27 వరకు జరిగే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో కౌంటీ క్లబ్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో లీసెస్టర్షైర్ చేరుకున్నభారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. నెట్స్లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను లీసెస్టర్షైర్ కౌంటీ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఇంగ్లండ్ చేరుకున్నాక తొలి ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. అంతకుముందు టీమిండియా టెస్టు స్పెషలిస్టులతో లండన్లో రెండు రోజుల ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. తొలి ప్రాక్టీస్ సెషన్ రోహిత్ దూరమయ్యాడు.
విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్లతో కూడిన తొలి బ్యాచ్ ముంబై నుంచి జూన్ 16న లండన్కు చేరుకుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తొలి బ్యాచ్ వచ్చిన ఒక్క రోజు తర్వాత ఇంగ్లండ్ చేరుకున్నాడు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్లో పాల్గొన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ త్వరలోనే టెస్టు జట్టులోకి చేరనున్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే.
చదవండి: 'ట్విటర్కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి'
Welcome @BCCI 🇮🇳
It's a pleasure to have you at Uptonsteel County Ground this week. 🤝
🦊#IndiaTourMatch | #LEIvIND https://t.co/CnPpjMRsDV pic.twitter.com/KX0bAsCQ7o
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 20, 2022
Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc
— BCCI (@BCCI) June 20, 2022