సచిన్‌ చేతుల మీదుగా సన్మానం  

31 Jan, 2023 07:11 IST|Sakshi

దక్షిణాఫ్రికాలో ఆదివారం ముగిసిన తొలి అండర్‌–19 మహిళల ప్రపంచకప్‌ టి20 క్రికెట్‌ టోరీ్నలో విజేతగా నిలిచిన భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సన్మానించనున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌ ప్రారంభానికి ముందు షఫాలీ వర్మ జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సచిన్‌ ముఖ్య అతిథిగా హాజరై భారత యువ జట్టును సత్కరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు.    

మరిన్ని వార్తలు