టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత

8 Apr, 2021 09:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల సానియా ప్రత్యేక ర్యాంకింగ్‌ నిబంధన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

సెమీఫైనల్లో సాయిదేదీప్య


సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిదేదీప్య సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య 6–2, 6–4తో అవిష్క గుప్తా (జార్ఖండ్‌)పై గెలిచింది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య–అవిష్క జంట 1–6, 6–4, 6–10తో స్నిగ్ధ (కర్ణాటక)–వేద (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయింది. 

మరిన్ని వార్తలు