-

రన్నరప్‌ సానియా మీర్జా జంట

30 Aug, 2021 06:36 IST|Sakshi

క్లీవ్‌ల్యాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–క్రిస్టినా మెకేల్‌ (అమెరికా) జంట రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆదివారం అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్‌ సీడ్‌ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

మరిన్ని వార్తలు