టాప్‌ సీడ్‌ జోడీపై సానియా జంట సంచలన విజయం

24 Feb, 2022 07:50 IST|Sakshi

ఖతర్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (7/5), 4–3తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్, టాప్‌ సీడ్‌ జోడీ సినియకోవా–క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్‌లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు. 

>
మరిన్ని వార్తలు