యూఎస్‌ ఓపెన్‌ బరిలో సానియా మీర్జా

10 Aug, 2021 05:05 IST|Sakshi

భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈనెల 30 నుంచి న్యూయార్క్‌లో మొదలయ్యే చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొననుంది. ఈ మేరకు నిర్వాహకులు ఆమెకు మహిళల డబుల్స్‌ విభాగంలో ‘వైల్డ్‌ కార్డు’ను కేటాయించారు. అమెరికా ప్లేయర్‌ కోకో వాండెవెతో కలిసి సానియా ఆడుతుంది. యూఎస్‌ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా ఈనెల 16 నుంచి జరిగే సిన్సినాటి ఓపెన్‌ టోర్నీలో ట్యునీíÙయా క్రీడాకారిణి ఆన్స్‌ జబూర్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు