సరిత, సుష్మలకు కాంస్యాలు

22 Apr, 2022 06:06 IST|Sakshi

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు రెండు కాంస్యాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత, 55 కేజీల కేటగిరీలో సుష్మ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌ ట్‌లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్‌)పై 11–0 తేడాతో (టెక్నికల్‌ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్‌)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్‌ షగయెవా (కజకిస్తాన్‌)పై 5–0తో, ఆపై సర్బినాజ్‌ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్‌)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ ఈ వెంట్‌ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్‌ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్‌ గా భారత్‌ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది.

మరిన్ని వార్తలు