రెండో టెస్టు ‘డ్రా’ 

18 Aug, 2020 02:26 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ నిస్సారమైన ‘డ్రా’గా ముగిసింది. వర్షం కారణంగా చాలా భాగం తుడిచిపెట్టుకుపోవడంతో రెండు ఇన్నింగ్స్‌లు కూడా పూర్తి కాలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 7/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 110 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. క్రాలీ (53) అర్ధ సెంచరీ చేశాడు. ఆ వెంటనే మ్యాచ్‌ను ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. చివరి టెస్టు శుక్రవారంనుంచి జరుగుతుంది.

మరిన్ని వార్తలు