Shooting World Cup: ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో అర్జున్, పార్థ్‌

11 Jul, 2022 06:37 IST|Sakshi

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు అర్జున్‌ బబూటా, పార్థ్‌ మఖీజా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలపై గురి పెట్టారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌ నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది.

53 మంది షూటర్ల మధ్య ఆదివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో అర్జున్‌ 630.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో, పార్థ్‌ 628.4 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచారు. టాప్‌–8లో నిలిచిన వారి మధ్య నేడు ఫైనల్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు