అయ్యర్‌... మరిన్ని రోజులు

20 Jul, 2021 05:18 IST|Sakshi

మాంచెస్టర్‌: మైదానంలో భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ ఆయ్యర్‌ ఆటను చూసేందుకు అతడి అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అతడి ఎడమ భుజానికి చేసిన శస్త్ర చికిత్స నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నెల 22 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఇంగ్లండ్‌ దేశవాళి వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌కు అయ్యర్‌ దూరమయ్యాడు. నిజానికి అతను ఈ టోర్నీలో లాంకషైర్‌ జట్టుకు ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఇంకా సాధించకపోవడంతో అయ్యర్‌ టోర్నీలో పాల్గొనడం లేదంటూ ఆ జట్టు తన ప్రకటనలో ప్రకటించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

మరిన్ని వార్తలు