PV Sindhu: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు

15 Jul, 2022 14:27 IST|Sakshi
పీవీ సింధు(PC: BAI Media)

సింగపూర్‌ ఓపెన్‌ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సత్తా చాటింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ హాన్‌ యుయేపై విజయం సాధించింది. ప్రత్యర్థిని 17-21, 21-11, 21-19 తేడాతో ఓడించి తెలుగు తేజం సింధు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే.. మరో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు భంగపాటు తప్పలేదు. జపాన్‌ ప్లేయర్‌ ఒహరి చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం నాటి క్వార్టర్‌ ఫైనల్స్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో సైనా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సైతం బీడబ్ల్యూఎఫ్‌ 500 టోర్నీ క్వార్టర్స్‌లో జపాన్‌ షట్లర్‌ కొడాయి నరోకా చేతిలో ఓడి ఇంటిబాటపట్టాడు.  

చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా..

మరిన్ని వార్తలు