Singapore Smash: క్వార్టర్‌ ఫైనల్లో మనిక–సత్యన్‌ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం 

15 Mar, 2023 08:58 IST|Sakshi

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) సింగపూర్‌ స్మాష్‌ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (భారత్‌) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.

మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్‌ (భారత్‌) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్‌ చెన్‌–యిది వాంగ్‌ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.   

మరిన్ని వార్తలు