ఆనంద్‌కు ఆరో ఓటమి

27 Jul, 2020 02:58 IST|Sakshi

చెన్నై: లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్, భారత నంబర్‌వన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వరుసగా ఆరో పరాజయం చవిచూశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్‌ నెపోమ్‌నియాచితో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌లో ఆనంద్‌ 2–3తో ఓడిపోయాడు. ఇప్పటికే ఆనంద్‌ వరుసగా స్విద్లెర్‌ , కార్ల్‌సన్, క్రామ్నిక్‌ , అనీశ్‌ గిరి , పీటర్‌ లెకో చేతిలో ఓటమి పొందాడు.

మరిన్ని వార్తలు