లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో తాను భాగం కానున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. కాగా లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో గంగూలీ ఆడనున్నాడంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం ట్విటర్లో ఓ పోస్టును షేర్ చేశాడు. ఈ వార్త పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారింది. తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందించాడు. లెజెండ్స్ లీగ్తో తాను భాగం కావడం లేదని, అవి అన్ని రూమర్సే అని గంగూలీ కొట్టి పారేశాడు.
"ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. నేను లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడటం లేదు అని" పిటిఐతో గంగూలీ పేర్కొన్నాడు. ఇక టోర్నమెంట్ ఒమెన్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ క్రికెటర్లు భాగం కానున్నారు.
The @BCCI president @SGanguly99 to @PTI_News "I am not a part of any Legends League. The news is not true."#CricketTwitter
— Kushan Sarkar (@kushansarkar) July 20, 2022
Here we go! One of India's most iconic captains and cricket's all-time greats Dada @SGanguly99 is now on #BossLogonKaGame.
Legends don't get bigger than this! Welcome to @llct20, #Dada. @DasSanjay1812#BossGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/hbCCypmJCT
— Legends League Cricket (@llct20) July 20, 2022
చదవండి: IND vs WI: జిమ్లో తెగ కష్టపడుతున్న రాహుల్.. వీడియో వైరల్..!