T20 WC 2022: జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. గాయంతో స్టార్‌ బ్యాటర్‌ దూరం

6 Sep, 2022 16:07 IST|Sakshi

అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టును టెంబా బవుమా నడిపించనుండగా.. గాయంతో స్టార్‌ ఆటగాడు వాండర్‌ డుసెన్‌ దూరమయ్యాడు. డుసెన్‌ దూరమయినప్పటికి పించ్‌ హిట్టర్‌ ట్రిస్టన్‌ స్టబర్న్‌ జట్టులోకి రాగా.. క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ రూపంలో నాణ్యమైన బ్యాటర్లు అందుబాటులో ఉ‍న్నారు.

ఇక బౌలింగ్‌ విభాగంలో కగిసో రబడా,అన్‌రిచ్‌ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి, కేశవ్‌ మహరాజ్‌, తబ్రెయిజ్‌ షంసీ ఉండగా.. వీరితో పాటు డ్వేన్‌ ప్రిటోరియస్‌, వేన్‌ పార్నెల్‌, రిలీ రోసౌలు కూడా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్‌ ప్లేయర్స్‌గా మార్కో జాన్సెన్‌, జోర్న్‌ ఫోర్టున్‌, పెక్యుల్వాయోలు ఉన్నారను. కాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తర్వాత టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన మూడో జట్టుగా ప్రొటిస్‌ నిలిచింది. 

టి20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనుంది. ఇక సూపర్‌ 12కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లలో సౌతాఫ్రికా కూడా ఉంది. ఇక గ్రూఫ్‌-2లో ఉన్న సౌతాఫ్రికా.. భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో లీగ్‌ దశలో మ్యాచ్‌లు ఆడనుంది.  

టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), ఎ మార్క్రమ్, ట్రిస్టన్‌ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్‌రిచ్‌ నార్ట్జే, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి, రిలీ రోసౌ, డి ప్రిటోరియస్, డబ్ల్యు పార్నెల్, తబ్రెయిజ్‌ షమ్సీ, కేశవ్‌ మహారాజ్

రిజర్వ్‌: బ్జోర్న్ ఫార్టుయిన్, మార్కో జాన్సెన్ మరియు ఆండిలే ఫెహ్లుక్వాయో

మరిన్ని వార్తలు