అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరి కొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన ప్రోటీస్.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్తో పాటు మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.