IND Vs SA ODI Series: భారత్‌తో వన్డే సిరీస్‌.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

2 Jan, 2022 22:08 IST|Sakshi

South Africa Squad For ODIs Against India: జనవరి 19 నుంచి టీమిండియాతో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం 17 మంది సభ్యుల దక్షిణాఫ్రికా బృందాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధ్యం వహించనుండగా.. ఇటీవలే టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్, సంచలన ఫాస్ట్ బౌలర్ మార్కో జెన్సన్, సీనియర్‌ పేసర్‌ రబాడ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌ మొత్తానికి దూరమైన స్టార్‌ పేసర్‌ నోకియా నోర్జే.. వన్డే జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. 


టీమిండియా వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్‌ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్
చదవండి: రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి
 

మరిన్ని వార్తలు