రేపు జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం 

31 Oct, 2021 07:58 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరగనుంది. 2020లో అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు నగదు బహుమతి లభించినా కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం అవార్డు జ్ఞాపికలను అందించలేకపోయింది.

దాంతో ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో రేపు నిర్వహించి వారికి ప్రత్యక్షంగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో అది సాధ్యం కాలేదు.

చదవండి: బంగారంలాంటి బాక్సర్‌.. తజముల్‌

మరిన్ని వార్తలు