SL-W vs IND-W: శ్రీలంకతో భారత్‌ తొలి పోరు..

1 Jul, 2022 07:44 IST|Sakshi

ప్రపంచ కప్‌ తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు మళ్లీ మైదానంలోకి దిగబోతోంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత్‌ నేడు జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో   తలపడుతుంది. మిథాలీరాజ్‌ రిటైర్మెంట్‌ తర్వాత టీమ్‌కు ఇదే తొలి వన్డే కావడం విశేషం.

లంకతో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో భారత్‌ గెలుచుకుంది. గతంలో 5 వన్డేల్లో భారత్‌కు సారథిగా వ్యవహరించిన హర్మన్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్‌. శ్రీలంకతో ఇప్పటి వరకు తలపడిన 29 వన్డేల్లో భారత్‌ 26 గెలిచి 2 మాత్రమే ఓడింది.
చదవండిSL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం  

మరిన్ని వార్తలు