జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా శరత్‌

18 Sep, 2021 05:50 IST|Sakshi

జాతీయ జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్‌ జట్టు మాజీ కెపె్టన్‌ శ్రీధరన్‌ శరత్‌ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్‌ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్‌ మోహన్, రణదేవ్‌ బోస్, పథీక్‌ పటేల్, హరీ్వందర్‌ సింగ్‌ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్‌ వేదికగా జరిగే అండర్‌–19 ప్రపంచ కప్‌ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. 

మరిన్ని వార్తలు