గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం

21 Feb, 2022 05:37 IST|Sakshi

స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు (52 కేజీలు) తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో బరిలోకి దిగుతుంది. ఈ బౌట్‌లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం లభిస్తుంది. 2019లో ఈ టోర్నీలో నిఖత్‌ స్వర్ణం సాధించింది. ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌ నుంచి 17 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు