Superbet Rapid And Blitz: విశ్వనాథన్‌ ఆనంద్‌కు మూడో స్థానం

24 May, 2022 08:33 IST|Sakshi

సూపర్‌బెట్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్, అరో నియన్‌ (అర్మేనియా)  23.5 పాయింట్లతో కలసి సంయుక్తగా రెండో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా అరోనియన్‌కు రెండో స్థానం, ఆనంద్‌కు మూడో స్థానం  దక్కింది. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య పోలాండ్‌లో జరిగిన ఈ టోర్నీ సోమవారం ముగిసింది. 24 పాయింట్లతో జాన్‌ క్రిస్టాఫ్‌  డూడా (పోలాండ్‌) విజేతగా నిలిచాడు. 

మరిన్ని వార్తలు