బీసీసీఐ పిటిషన్‌పై విచారణ వాయిదా

20 Jul, 2022 19:27 IST|Sakshi

అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు ఇతర ఆఫీస్‌ బేరర్ల పదవీకాలం పొడిగించుకునే వీలుగా బీసీసీఐ రాజ్యాంగంలో స‌వ‌ర‌ణలు చేప‌ట్టేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ రేపటికి (జులై 21) వాయిదా పడింది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును రేప‌టికి వాయిదా వేసింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని ప్రస్తుత బీసీసీఐ పాలకమండలి 2020లో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

బోర్డు రాజ్యాంగంలో ఆరు స‌వరణలు చేసేందుకు అనుమ‌తి కావాల‌ని బీసీసీఐ సుప్రీంను ఆశ్ర‌యించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా ప‌ద‌వీకాలం ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ముగియ‌నున్న‌ నేపథ్యంలో వీరిద్దరు కోర్డు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
చదవండి: కామన్‌ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్‌..!

మరిన్ని వార్తలు