IND vs SL: సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ

7 Jan, 2023 20:36 IST|Sakshi

శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి లంక బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. ఈ మిస్టర్‌ 360 మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఇక ఓవరాల్‌గా సూర్యకు ఇది మూడో అంతర్జాతీయ సెంచరీ. అయితే మూడు సెంచరీలు కూడా టీ20ల్లో సాధించడం విశేషం. కాగా ఏడాది సూర్యకుమార్‌కు ఇది తొలి సెంచరీ. కాగా సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు