వెస్టిండీస్తో తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి భోణీ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్లు కడదాకా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి(17 పరుగులు) చేసి ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కీపర్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాలని భావించాడు. కానీ పంత్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకోవడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
చదవండి: బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్' అని అపవాదు.. ఇప్పుడది పటాపంచలు
ఈ దశలో యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. వెంటనే సూర్యకుమార్.. అయ్యర్తో.. ''వెంకీ మనం మ్యాచ్ గెలవాలి.. జాగ్రత్తగా ఆడు'' అని చెప్పడం స్టంప్ మైక్లో రికార్డయింది. సూర్య మాటకు వెంకటేశ్ అయ్యర్ కట్టుబడి ఆడాడు. చివరి వరకు నిలబడిన అయ్యర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 24 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ (18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 34 పరుగులు నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: రోహిత్ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయ్.. తొలి మ్యాచ్ కదా వదిలేయ్
అంతకముందు బౌలింగ్లో రవి బిష్ణోయ్ మెరిశాడు. తన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయ్.. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అతనికి తోడు మిగతా బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61,4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.
.@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I.
Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3
— BCCI (@BCCI) February 16, 2022
— Sports Hustle (@SportsHustle3) February 16, 2022