Suryakumar Yadav: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే?

21 Aug, 2021 19:43 IST|Sakshi

లండన్‌: టీమిండియా యువ సంచలనం సూర్య​కుమార్‌ యాదవ్‌  దాదాపు 65 రోజుల తర్వాత  తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దీంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడంతో ఇద్దరూ డ్యాన్స్‌ చేస్తూ పరస్పరం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోను  సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ స్టార్ తన భార్యతో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.

చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్‌ యువ పేసర్‌

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియోలో తెగవైరల్‌  అవుతోంది. కాగా సూర్య​కుమార్‌ యాదవ్‌ గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్​కు ముందు బయోబబుల్​ కోసం  తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్తూ 10 రోజులు మళ్ళీ క్వారంటైన్​లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో ఈ జంట లండన్‌ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది.

చదవండి:Mohammed Siraj: సిరాజ్​ ఎంపిక, విజయంలో ఆయన పాత్రే కీలకం!

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

మరిన్ని వార్తలు