T20 WC 2022 IND VS ENG: అనుకున్నదే అయ్యింది.. ఆ ఇద్దరు ఔట్‌

10 Nov, 2022 13:23 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్‌ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు అనుకున్న విధంగానే ఇంగ్లండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయాల కారణంగా స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ మలాన్‌, మార్క్‌ వుడ్‌ కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యారు.

వీరి స్థానాల్లో ఫిలిప్‌ సాల్ట్‌, క్రిస్‌ జోర్డాన్‌ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహాయించి.. శ్రీలంకపై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్‌ యధాతథంగా కొనసాగించింది. ఇంగ్లండ్‌ విజయావకాశాలను ప్రభావితం చేయగల మలాన్‌, వుడ్‌ జట్టులో లేకపోవడంతో ఇంగ్లండ్‌ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. జింబాబ్వేపై బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. దీంతో రిషబ్‌ పంత్‌కు మరో అవకాశం దక్కినట్లైంది. 

జట్ల వివరాలు..
టీమిండియా: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌

ఇంగ్లండ్‌: జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు