IND Vs PAK: భారత్‌తో మ్యాచ్‌.. కన్నీటి పర్యంతమైన బాబర్‌ ఆజమ్‌ తండ్రి, వైరల్‌ వీడియో

25 Oct, 2021 10:21 IST|Sakshi

Babar Azam Father Gets Emotional: భారీ అంచనాలతో టీ20 వరల్డ్‌కప్‌ బరిలోకి దిగిన భారత్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దాయాది దేశంతో పోరులో టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లి సేన 151 పరుగులు చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాహిన్‌ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ కొట్టాడు.

ఇక రికార్డు ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో పరుగుల వరద పారించిన మొహమ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలుపొందడంతో పాకిస్తాన్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
(చదవండి: IND Vs PAK: చరిత్ర సృష్టించిన పాక్‌ ఓపెనర్లు.. )

ఈక్రమంలో మ్యాచ్‌ వీక్షిస్తున్న పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తండ్రి ఆజమ్‌ సిద్ధిఖీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్లుగా భారత్‌పై విజయం కోసం నిరీక్షిస్తున్న వేళ తన కొడుకు సారథ్యంలో ఆ కల నేరవేరడంతో  ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విజయంతో గ్రూప్‌ 2లో పాకిస్తాన్‌ టాప్‌లో కొనసాగుతోంది.
(చదవండి: ఐఎస్‌ఎల్‌లో తొలి భారతీయ హెడ్‌ కోచ్‌గా ఖాలిద్‌ జమీల్‌)

మరిన్ని వార్తలు