Rishabh Pant: పాండ్యా కోసం పంత్‌ త్యాగం.. ఆడకపోయినా మనసులు గెలుచుకున్నాడు

10 Nov, 2022 16:01 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పంత్‌ మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి ఔట్‌ అయ్యాకా క్రీజులోకి వచ్చిన పంత్‌ 4 బంతుల్లో ఆరు పరుగులు చేసి రనౌటయ్యాడు. మ్యాచ్‌లో పెద్దగా మెరవకపోయినా అభిమానుల మనుసులు మాత్రం గెలుచుకున్నాడు.

విషయంలోకి వెళితే.. జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ మూడో బంతిని ఔట్‌సైడ్‌ వేయగా పంత్‌ బ్యాట్‌కు తాకలేదు. అయితే పాండ్యా సింగిల్‌ కోసం సగం పిచ్‌ దాటేశాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ వెళ్లడం ఇష్టంలేక పాండ్యా ముందుకు కదిలాడు. ఇది గమనించిన పంత్‌ తాను ఔటైనా పర్లేదనుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అయితే బట్లర్‌ నుంచి బంతి అందుకున్న జోర్డాన్‌ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో పంత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ దశలో పంత్‌ హార్దిక్‌ వైపు చూస్తూ పర్లేదు.. నువ్వు ఆడు అన్నట్లుగా పేర్కొంటూ పెవిలియన్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి పంత్‌ బాగా ఆడకపోయినప్పటికి అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడని కామెంట్‌ చేశారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పాండ్యా 63 పరుగులు, కోహ్లి 50 పరుగులతో రాణించగా.. రోహిత్‌ శర్మ 27 పరుగులు చేశాడు.

చదవండి: సెమీస్‌ అంటే కోహ్లికి పూనకాలే..

మరిన్ని వార్తలు