T20 WC 2021 IND Vs PAK: ఆ రోజు బాబర్‌ ఆజమ్‌ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..!

31 Oct, 2021 19:34 IST|Sakshi

Babar Azam Mother Was On Ventilator During India Pakistan Match: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తీవ్ర ఆవేదనలో ఉన్నాడని అతని తండ్రి ఆజమ్‌ సిద్ధిఖీ తాజాగా వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్‌ సమయంలో బాబర్‌ తల్లి వెంటిలేటర్‎పై ఉందని ఆజమ్‌ సిద్ధిఖీ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు బాబర్‌ తల్లికి శస్త్రచికిత్స జరిగిందని, ఈ విషయం బాబర్‌కు కూడా తెలుసని, ఆ బాధలోనే అతను ప్రపంచకప్‌ బరిలోకి దిగాడని పేర్కొన్నాడు. 

A post shared by Azam Siddique (@azam.siddique56)

క్లిష్ట సమయంలో భార్యను బెడ్‌పై వదిలి వచ్చేందుకు తన మనసు అంగీకరించనప్పటికీ.. బాబర్‌ బలహీనపడకూడదని మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ పేర్కొన్నాడు. బాబర్‌ గడిచిన మూడు మ్యాచ్‌లు తీవ్రమైన బాధతో ఆడాడని.. ఈ విషయం అభిమానులకు తెలియాలని వెల్లడిస్తున్నాని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్‎లో గత ఆదివారం(అక్టోబర్‌ 24) పాక్‌‎తో జరిగిన మ్యాచ్‎లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడాల్సి ఉంది.
చదవండి: పాక్‌తో ఓడిపోవడం బాధ కలిగించింది.. అందుకే రిటైర్మెంట్‌

>
మరిన్ని వార్తలు