BCCI Official Update On Team India New Jersey : త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ ఎలా ఉంటుంది, దాని రంగు వంటి విషయాలను ఈ నెల 13న వెల్లడించనున్నట్లు ఇవాళ ట్విట్టర్లో వెల్లడించింది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి నేవీ బ్లూ జెర్సీలో దర్శనమిస్తున్న భారత క్రికెటర్లు.. అక్టోబర్ 24న పాక్తో జరగబోయే మెగా పోరులో సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించనుంది.
The moment we've all been waiting for!
Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳
Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQU
— BCCI (@BCCI) October 8, 2021
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్లో టీమిండియాను ఓడిస్తే..?