టీ20 ప్రపంచకప్-2022కు సంబంధించి కీలక అప్‌డేట్‌

18 Jan, 2022 13:44 IST|Sakshi

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచక‌ప్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. మెగా టోర్నీ వేదిక‌లు ఖ‌రారైనట్లు, మొత్తం 7 వేదిక‌ల్లో టోర్నీ జరగనున్నట్లు మంగళవారం ప్రకటించారు. మెల్‌బోర్న్‌, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ నగరాల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు.


మొత్తం 12 జ‌ట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబ‌ర్ 16-న‌వంబ‌ర్ 13 మ‌ధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 21న వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌, తదితర వివరాలను ప్రకటించనున్నట్లు ఐసీసీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే, టీ20 ర్యాంకింగ్స్‌లో గతేడాది చివరి నాటికి టాప్‌-8లో ఉన్న జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్‌-2022కు నేరుగా అర్హ‌త సాధించగా.. మిగ‌తా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. భార‌త్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘ‌నిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్లు క్వాలిఫైయ‌ర్స్‌లో తలపడతాయి. కాగా, దుబాయ్‌ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆరోన్‌ ఫించ్‌ నేతృత్వంలో ఆసీస్‌ జట్టు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ ఛాంపియన్‌ నిలిచింది. 
చదవండి: ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇలా.. అయినా అందరి చూపు అతనివైపే..!

మరిన్ని వార్తలు