Manika Batra: కోచ్‌ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు! 

29 Oct, 2021 12:27 IST|Sakshi

Manika Batraటోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌పై ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్‌ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు.

చదవండి: T20 World Cup 2021: టాస్‌ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే

>
మరిన్ని వార్తలు