Shreyas Iyer: శ్రేయాస్‌ అయ్యర్‌కు టీమిండియా అరుదైన గౌరవం  

28 Nov, 2021 19:25 IST|Sakshi

Team India Standing Ovation For Shreyas Iyer.. న్యూజిలాండ్‌తో డెబ్యూ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న శ్రేయాస్‌ అయ్యర్‌కు అరుదైన గౌరవం లభించింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో మెరిసిన అయ్యర్‌కు టీమిండియా స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి గౌరవం తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చదవండి: IND Vs NZ: ఆరంగేట్ర మ్యాచ్‌లో మరో రికార్డు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌..

ఇక అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, అర్థసెంచరీ సాధించిన అయ్యర్‌ టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక డెబ్యూ టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అయ్యర్‌ మూడో స్థానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నిగ్స్‌లో 65 పరుగులు చేసిన అయ్యర్‌..  రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 170 పరుగులు సాధించాడు.

చదవండి: BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్‌ అలీ.. అంపైర్‌ వార్నింగ్‌ 

అంతకుముందు డెబ్యూ టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్‌(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్‌ శర్మ ఉన్నాడు. కాగా  అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్‌ మరో రికార్డు కూడా నెలకొల్పాడు.

>
మరిన్ని వార్తలు