ఆసియా కప్‌లో నేడు భారత్‌-పాకిస్తాన్‌ ‘ఢీ’ 

23 May, 2022 07:36 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జకార్తాలో నేడు జరిగే తొలి మ్యాచ్‌తో భారత హాకీ జట్టు ఆసియా కప్‌ టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. బీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత్‌ బరిలోకి దిగనుంది. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో 10 మంది కొత్త ఆటగాళ్లకు తొలిసారి అవకాశం లభించింది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌ చానెల్‌లో, డిస్నీ–హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

మరిన్ని వార్తలు