National Games 2022: వ్రిత్తి ఖాతాలో మరో పతకం 

8 Oct, 2022 09:30 IST|Sakshi

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో వ్రిత్తి అగర్వాల్‌ కాంస్య పతకం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ విభాగంలో వ్రిత్తి 4 నిమిషాల 34.96 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ జాతీయ క్రీడల్లో వ్రిత్తికిది మూడో పతకం కావడం విశేషం. ఇప్పటి వరకు తెలంగాణ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో 14వ స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు