తెలుగు టైటాన్స్, బెంగాల్‌ వారియర్స్‌ మ్యాచ్‌ ‘టై’

8 Feb, 2022 09:36 IST|Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్‌ జట్టు 32–32 స్కోరుతో ‘టై’ చేసుకుంది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది నాలుగో ‘టై’ కావడం గమనార్హం. టైటాన్స్‌ తరఫున అంకిత్‌ తొమ్మిది పాయింట్లు, రజనీశ్‌ ఏడు పాయింట్లు స్కోరు చేశారు.

బెంగాల్‌ తరఫున మణీందర్‌ అత్యధికంగా 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 36–31తో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్‌; యు ముంబాతో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.

చ‌ద‌వండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!

మరిన్ని వార్తలు